telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఆగస్టు 28న ఎన్ .టి .ఆర్ 100 నాణెం విడుదల, హాజరవుతున్న అన్నగారి కుటుంబం

మహానటుడు, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్ .టి . రామారావు శత జయంతి సందర్భంగా ఈ నెల 28న కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల నాణెము ను విడుదల చేస్తోంది. న్యూ ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపతి ముర్ము నాణేన్ని విడుదల చేస్తారు .

అన్న ఎన్. టి .ఆర్ కుటుంబ సభ్యులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు .
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి ఈ కార్యక్రమాన్ని సమన్వయము చేస్తున్నారు.
ప్రభుత్వం తరుపున ఆమె ఆహ్వాన పత్రికను పంపించి , స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు తో పాటు రామారావు గారి కుమారులు , కుమార్తెలు , మనుమలు , మనవరాళ్లను పురందేశ్వరి స్వయంగా ఆహ్వానించారు. రామారావు గారికి సన్నిహితులైన సినిమా వారు , రాజకీయ నాయకులను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా పురందేశ్వరి ఆహ్వానించారు. అయితే రామారావు రెండవ భార్య లక్ష్మీ పార్వతిని మాత్రం ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదు.

Related posts