ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినాయకుడు అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర ఎన్నికల్లో 70 సీట్లకుగాను 62 సీట్లు సాధించి ఆప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈనెల 16వ తేదీన ఢిల్లీలోని రామలీలా మైదానంలో జరిగే కార్యక్రమంలో ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇప్పటికే లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ లాంఛనంగా అసెంబ్లీని రద్దు చేశారు. ఈరోజు ఉదయం గవర్నర్తో కేజ్రీవాల్ భేటీ అయ్యారు. 15 నిమిషాలపాటు చర్చించారు. మరోవైపు ఈరోజు ఆప్ ఎమ్మెల్యేలు సమావేశమై కేజ్రీని శాసనసభాపక్షం నేతగా ఎన్నుకోనున్నారు. అనంతరం గవర్నర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి కోరుతారు.
సీఎం జగన్ అసత్యాలతో తమకు సవాల్ విసురుతున్నారు: చంద్రబాబు