telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

శివ రాజ్‌కుమార్ పాన్ ఇండియా యాక్షన్ ‘ఘోస్ట్’ అక్టోబర్ 19న రానుంది

అక్టోబర్ 19న శివరాజ్ కుమార్ ‘ఘోస్ట్’ ప్రపంచవ్యాప్తంగాడా శివరాజ్ కుమార్ హీరోగా ప్యాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న చిత్రం ఘోస్ట్. బీర్బల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్ర దర్శకుడు శ్రీని ఘోస్ట్ చిత్రానికి దర్శకుడు.నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఘోస్ట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఘోస్ట్ ను ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 19న దసరా కానుకగా విడుదల చేయనున్నారు.

ఆకట్టుకునే ఘోస్ట్ ప్రచార చిత్రాల తో పాటు, ఇటీవల జైలర్ లో శివన్న పాత్రకు వచ్చిన రెస్పాన్స్ ఘోస్ట్ పై మరింత హైప్ ను తీసుకొచ్చింది. తమ భాషల్లో ఘోస్ట్ రైట్స్ కోసం పెద్ద సంస్థల నుండి ఆఫర్స్ వస్తున్నాయి. చిత్ర బృందం అక్టోబర్ రెండవ వారం నుండి దేశవ్యాప్తంగా స్పెషల్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ రెండవ వారంలో ట్రైలర్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

ప్రముఖ నటులు అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అర్చన జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ‘ఘోస్ట్’ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మస్తీ, ప్రసన్న వి ఎం డైలాగ్స్ రాస్తున్నారు. మోహన్ బి కేరే ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య సంగీతాన్ని అందిస్తున్నారు. కన్నడ లో టాప్ స్టార్స్, టెక్నీషియన్స్ తో చిత్రాలు తీసే సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత సందేశ్ నాగరాజ్ ‘ఘోస్ట్’ ని లావిష్ స్కేల్ లో ప్రొడ్యూస్ చేస్తున్నారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో ఘోస్ట్ అక్టోబర్ 19న దసరా కు ప్రేక్షకుల ముందుకి రానుంది.

Related posts