మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన “చిత్రలహరి” ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ చిత్రం ఇచ్చిన బూస్ట్ తో సాయిధరమ్ తేజ్ చేస్తున్న తాజా చిత్రం “ప్రతిరోజు పండగే”. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. “ప్రతిరోజు పండగే” అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా కథానాయికగా నటిస్తుంది. కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో సరికొత్త లుక్లో తేజూ కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ‘పది మంది ఉండగా ప్రతి రోజు పండగే..పడి నవ్వుతుండగా ప్రతి రోజు పండగే’ అంటూ సాగే టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది. అంతా ఉమ్మడిగా కలిసుంటే ప్రతీ రోజూ పండగలా ఉంటుందనే సందేశంతో ఉన్న ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ఎస్ ఎస్ థమన్ ఈ మూవీకి సంగీతం అందించాడు. “ప్రతిరోజూ పండగే” చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేయనున్నారు. మీరు కూడా ఈ లిరికల్ వీడియో సాంగ్ ను వీక్షించండి.
next post