telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

నేటి నుంచి భద్రాచలంలో నిత్య కళ్యాణాలు!

తెలంగాణలోని భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవాలయంలో స్వామివారి నిత్య కల్యాణాలు నేటి నుంచి పునః ప్రారంభమయ్యాయి. అయితే ప్రస్తుతానికి కల్యాణాలకు భక్తులను అనుమతి లేయదని, వాటిని ఏకాంతంగానే నిర్వహిస్తామని దేవస్థానం అధికారులు వెల్లడించారు.

గత నెల 20వ తేదీన కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కల్యాణ సేవలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆపై శ్రీరామనవమి నాడు ఎంతో వైభవంగా సాగే రాములోరి కల్యాణాన్ని సైతం పరిమిత సంఖ్యలో పూజారులు, అధికారుల మధ్యనే జరిపించిన సంగతి తెలిసిందే. నేటి నుంచి స్వామివారికి నిత్యమూ జరిగే ఆర్జిత సేవలను ఏకాంతంగా జరిపిస్తామని అధికారులు వెల్లడించారు.

Related posts