ప్రభాస్ ప్రధాన పాత్రలో సుజీత్ దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్ సంస్థ దాదాపు 300 కొట్లతో నిర్మించిన చిత్రం “సాహో”. ఈ చిత్రం భారీ అంచనాలతో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రంలో నీల్ నితిన్ ముఖేష్, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, వెన్నెల కిశోర్, మందిరా బేడీ కీలక పాత్రల్లో నటించారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ చిత్రం 350కి పైగా కలెక్షన్లను సాధించింది. డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికి భారీ వసూళ్ళు సాధించడం చిత్ర బృందానికి సంతోషాన్నిచ్చింది. ఇక బాలీవుడ్లో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించి వంద కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది. అయినప్పటికి బాలీవుడ్ విశ్లేషకులు “సాహో” సినిమాని తగ్గించి ట్వీట్స్ చేయడం సినిమా లవర్స్కి చిరాకు తెప్పిస్తుంది. తప్పుడు సమాచారంతో వారు ప్రేక్షకులని తప్పుదోవ పట్టిస్తున్నారని, సౌత్ సినిమాలపై వారు చూపిస్తున్నఈ వైఖరి ఏం బాగోలేదంటూ నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తరణ్ ఆదర్శ్ “సాహో” సినిమా విడుదలైన రోజు ఈ చిత్రం భరించలేని సినిమా అని చెబుతూ ప్రేక్షకులు ఈ సినిమాపై పెదవి విరుస్తున్నారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు కలెక్షన్స్ విషయంలోను ఆయన తప్పుడు లెక్కలు చెబుతున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
previous post