telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కలకత్తాలో ర్యాలీ మాదిరి.. అమరావతిలో… హాజరవనున్న 22 పార్టీలు…

Chandrababu comments Jagan cases

ఇటీవల కలకత్తాలో మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగిన విపక్షాల ఐక్యతా ర్యాలీ గురించి తెలిసిందే. అదే తరహా ర్యాలీ, బహిరంగ సభను అమరావతిలో నిర్వహిస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం టీడీపీ నేతలు, ఇన్ చార్జ్ లు, ముఖ్య కార్యకర్తలతో టెలి కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన, కోల్ కతా సభ దేశ ప్రజలకు ఓ భరోసాను ఇచ్చిందని అభిప్రాయపడ్డారు. అతి త్వరలోనే అమరావతిలో దానికి దీటైన సభను నిర్వహిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా 22 ప్రాంతీయ పార్టీల అధినేతలు ఈ ర్యాలీకి హాజరవుతారని చెప్పారు.

అసెంబ్లీ వేదికగా, కేసీఆర్ మాట్లాడుతూ, వైఎస్ ను పొగిడారని, నరేంద్ర మోదీ డైరెక్షన్ వల్లే ఇప్పుడు జగన్ తో కలవాలని కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించారని నిప్పులు చెరిగారు. ఈ రెండు పార్టీలూ కలిసి ఏపీని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నాయని, ప్రజలు వీరిని అడ్డుకోవాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Related posts