telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

శ్రీశైలం ప్రమాదంపై సీఐడీ విచారణకు కేసీఆర్ ఆదేశం

KCR cm telangana

శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంపై సీఐడీ విచారణకు ఆయన ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను వెలికి తీయాలని అధికారులకు సూచించారు.

ప్రమాదానికి గల కారాణాలను వెలికితీయాలని పేర్కొన్నారు. సీఎం ఆదేశాలతో సీఐడీ అడిషనల్ డీజీపీ గోవింద్ సింగ్ ను విచారణ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, నివేదిక అందించాలని ఆదేశించారు.

Related posts