బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే సుశాంత్ మృతి కేసును సీబీఐకి అప్పగించడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి విషయంలో మాహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే ప్రమేయం ఉందని ఇటీవల కంగన ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇటీవల ఆదిత్య స్పందించారు. తన కుటుంబంపై కావాలనే కొందరు ఆరోపణలు చేస్తున్నారని, ప్రతిపక్షాలు “మురికి రాజకీయాలు” చేస్తున్నాయని విమర్శించారు. దీంతో తాజాగా ఆదిత్య ఠాక్రేను బాలీవుడ్ బోల్డ్ క్వీన్ కంగనా రనౌత్ సోషల్ మీడియా వేదికగా ఏకి పారేసింది. ఈ వ్యాఖ్యలపై తాజాగా కంగన డిజిటల్ టీమ్ వరుస ట్వీట్లు చేసింది. “చూడండి.. మురికి రాజకీయాల గురించి ఎవరు మాట్లాడుతున్నారో..! మీ తండ్రి సీఎం కావడమే `డర్టీ పాలిటిక్స్`కు మంచి ఉదాహరణ సర్. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానికి సంబంధించి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పమని మీ తండ్రిని అడగండి` అని పలు ప్రశ్నలను ట్వీట్ చేసింది.
1) రియా ఎక్కడ ఉంది ?
2) సుశాంత్ అసహజ మరణంపై ముంబై పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ?
3) ఫిబ్రవరి నెలలో సుశాంత్ జీవితం ప్రమాదంలో ఉందని ఫిర్యాదు అందినపుడు… ముంబై పోలీసులు దీనిని మొదటి రోజే ఆత్మహత్య అని ఎలా నిర్ధారించారు ?
4) ఐపీఎస్ వినయ్ తివారీని క్వారంటైన్ పేరిట ఎందుకు లాక్ చేశారు ?
5) సిబీఐకి కేసు అప్పగించడానికి ఎందుకు భయపడుతున్నారు ? అంటూ పలు ప్రశ్నలను కంగన సంధించింది. ఈ ప్రశ్నలకు రాజకీయాలతో సంబంధం లేదని, దయచేసిన వాటికి సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేసింది.
Ha ha look who is talking about dirty politics, how your father got CM seat is a case study of dirty politics sir… forget all that ask your father to answer few questions related to SSR death ..
1) Where is Rhea? …(1/4) https://t.co/lM3gicTZfR— Team Kangana Ranaut (@KanganaTeam) August 4, 2020