రాష్ట్రంలోని చాలా మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి విముఖత చూపుతున్నారు. ఇటీవల జింద్ అసెంబ్లీ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాణించలేకపోయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా ఏఐసీసీ ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలాను నిలబెట్టినప్పటికీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఎన్నిక ఫలితాల్లో భాజపా అభ్యర్థి గెలవగా, జేజేపీ నేత రెండో స్థానంలో నిలిచారు. సుర్జేవాలా మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.
ఈ రాష్ట్రంలో 10 లోక్సభ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో భాజపా 7, ఐఎన్ఎల్డీ 2, కాంగ్రెస్ 1 స్థానాల్లో గెలుపొందాయి. ఇటీవల దిల్లీలో కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆ పార్టీ హరియాణా సీనియర్ నేతలు.. పోటీ చేసే అంశంపై అయిష్టత కనబర్చారు.
నన్ను ఓడించడానికి రూ.150 కోట్లు ఖర్చు చేశారు: పవన్