telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై మానవహక్కుల కమిషన్‌ కు ఫిర్యాదు

jaggareddy in pcc race in telangana

తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రైవేట్‌ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం నాంపల్లిలో మానవహక్కుల కమిషన్‌(హెచ్చార్సీ) చైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్యకు ఆ సంఘం అధ్యక్షుడు రాములు ఫిర్యాదు చేశారు.

సంగారెడ్డిలో మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా ఓ ఫోన్‌ సంభాషణలో బహిరంగంగా మంత్రి హరీశ్‌రావును దుర్భాషలాడారని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దీనికి సంబంధించిన వీడియోసీడీలను సమర్పించారు. ఎమ్మెల్యేగా ఉండి చట్టాలకు, మానవ హక్కులకు వ్యతిరేకంగా మాట్లాడిన జగ్గారెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని కోరారు.

Related posts