telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సీఎం కుర్చీ పై నేడు ఆసీనులు కానున్న జగన్!

jagan ys

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి నిన్న ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయన నేడు తొలిసారిగా సచివాలయంలో అడుగుపెట్టనున్నారు. జగన్ మొట్టమొదటి సారి సెక్రటేరియేట్ కు రానుండటంతో, పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుంటున్నారు. నేడు, రేపు ఆయన సచివాలయంలో ఉంటారని, పరిపాలనా వ్యవహారాలు చూసుకుంటారని పార్టీ నేతలు ప్రకటించారు.

ఇక జగన్ కోసం సీఎం చాంబర్ ను అధికారులు సరికొత్తగా ముస్తాబు చేశారు. సీఎం చైర్ పై జగన్ తొలిసారి నేడు ఆసీనులు కానున్నారు. క్యాబినెట్ హాల్, హెలిపాడ్‌ లు, తాడేపల్లి నుంచి సచివాలయం వరకూ కాన్వాయ్ రూట్ సిద్ధమయ్యాయి. చాంబర్ ముందు సీఎం నేమ్ ప్లేట్‌ సిద్దమైంది. జగన్ సచివాలయానికి రానున్న నేపథ్యంలో అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు.

Related posts