telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సీఎం కేసీఆర్‌ పేదలకు “ఆసరా” గా నిలుస్తున్నారు: హరీశ్‌రావు

Ryathu bandhu amount Rs. 10000 in future

తెలంగాణ సీఎం కేసీఆర్‌ పేదలకు “ఆసరా” గా నిలుస్తున్నారని టీఆర్ఎస్ నేత, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. సిద్ధిపేటలో ఆసరా పింఛన్ల ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్‌ రావు పాల్గొన్నారు. లబ్ధిదారులకు హరీశ్‌రావు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి పింఛన్లు పెంపు జరిగింది. ఎన్నికల కోడ్‌ వల్ల పింఛన్ల పెంపు 6 నెలల ఆలస్యం అయిందన్నారు.

రూ.2016, రూ.3016 పింఛను ఇస్తూ సీఎం కేసీఆర్‌ పేదలకు అండగా నిలుస్తున్నారు. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని కొనియాడారు. త్వరలోనే నిజమైన పేదలందరికీ రెండు పడక గదుల ఇళ్ల పంపిణీ చేస్తామన్నారు. చెట్లు తగ్గడం వల్లే కాలుష్యం పెరిగి అనారోగ్యం బారిన పడుతున్నామని హరీశ్‌ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, లబ్దిదారులు పాల్గొన్నారు.

Related posts