telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

గుంటూరు జైలుకు ర‌ఘురామ‌కృష్ణంరాజు…

ycp Raghurama krisharaju

ప్రస్తుతం ఏపీలో వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు వివాదం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈరోజు ర‌ఘురామ‌కృష్ణంరాజు ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు సీఐడీ అధికారులు.. ఈ నేపథ్యంలో జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైద్య పరీక్షలు ముగిసిన వెంటనే ఆయనను జీజీహెచ్ నుంచి నేరుగా జిల్లా కేంద్ర జైలుకు త‌ర‌లించారు.. ఇక‌, ఆయ‌న‌కు సీఐడీ ప్రత్యేక కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే. మ‌రోవైపు ర‌ఘురామ కృష్ణంరాజు ఆరోగ్య ప‌రిస్థితిపై జిల్లా కోర్టు నుంచి వైద్య బృందం నివేదిక హైకోర్టుకు చేరింది.. దీనిపై హైకోర్టులో విచార‌ణ ప్రారంభం అయ్యింది.. మ‌రోవైపు.. జైలు అధికారులు ర‌ఘురామ‌కృష్ణంరాజుకు 3468 నంబ‌ర్ కేటాయించారు.. ఆయ‌న‌కు జిల్లా జైలులోని పాత బ్యార‌క్‌లో ఓ సెల్ కేటాయించారు అధికారులు. చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts