ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ పరీక్ష ఈరోజు ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరగనుంది. కంప్యూటర్ ఆధారితంగా జరిగే ఈ పరీక్షకు తెలంగాణ, ఏపీలో కలిపి 55,578 మంది ఈ పరీక్ష రాస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్లో ఐసెట్ ప్రవేశ పరీక్ష జరగనుంది. ఇవాళ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షను నిర్వహిస్తారు.
ఈ పరీక్షల నిర్వహణ కోసం హైదరాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, మహబూబ్నగర్, నల్లగొండ, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్లో, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఐసెట్ను కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్నది. షెడ్యూల్ ప్రకారం జూలై 13న ఐసెట్ పరీక్ష జరగాల్సి ఉన్నది. అయితే కరోనా నేపథ్యంలో పరీక్షను వాయిదావేశారు.
రైతుల నుంచి భారీగా వసూళ్లు: దేవినేని ఉమ