telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

ఐసెట్ ప్రవేశ పరీక్ష ప్రారంభం..

exam hall entrence

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే ఐసెట్ ప‌రీక్ష ఈరోజు ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరగనుంది. కంప్యూట‌ర్ ఆధారితంగా జరిగే ఈ ప‌రీక్ష‌కు తెలంగాణ, ఏపీలో కలిపి 55,578 మంది ఈ పరీక్ష రాస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్‌లో ఐసెట్ ప్రవేశ పరీక్ష జరగనుంది. ఇవాళ ఉద‌యం 9.30 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్షను నిర్వ‌హిస్తారు.

ఈ పరీక్షల నిర్వహణ కోసం హైద‌రాబాద్‌, ఆదిలాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం, కోదాడ‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, న‌ల్ల‌గొండ‌, నిజామాబాద్‌, సిద్దిపేట‌, వ‌రంగల్‌లో, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని క‌ర్నూలు, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నంలో ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది ఐసెట్‌ను కాక‌తీయ విశ్వ‌విద్యాల‌యం నిర్వ‌హిస్తున్న‌ది. షెడ్యూల్ ప్ర‌కారం జూలై 13న ఐసెట్ ప‌రీక్ష జ‌ర‌గాల్సి ఉన్న‌ది. అయితే క‌రోనా నేప‌థ్యంలో ప‌రీక్ష‌ను వాయిదావేశారు.

Related posts