తెలంగాణను పబ్లిక్ ఎంటర్ ఫ్రైజ్ కంపెనీగా కేసీఆర్ మార్చేశారని బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ కి బీజేపీ యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య ఇవాళ చేరుకున్నారు. దీంతో అక్కడ ఎన్ సీసీ గేట్ దగ్గర అడ్డుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య మీడియాతో మాట్లాడారు. ఎంఐఎంకు ఓటు వేస్తే.. ఓవైసీలు దేశమంతా బలపడే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ ల మాదిరి.. గ్రేటర్ లో ఒక్క అవకాశం బీజేపీకి ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ ఏ ఒక్కరి వల్లనో అభివృద్ధి చెందలేదని… గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు.. దక్షిణ భారతదేశంలో మార్పుకు శ్రీకారం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కేవలం ఒక్క కుటుంబం కోసమే పని చేస్తోందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం నిర్వచనం మారిపోయిందని… ఫార్ దా ఫ్యామిలీ, బై దా ఫ్యామిలీ, టూ దా ఫ్యామిలీ అయిందని పేర్కొన్నారు. తెలంగాణలో అసలైన ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉందని.. కన్నడిలు అంత బీజేపీకి మద్దతుగా నిలవాలని కోరారు.
previous post
జగన్ కోసం కుట్రలకు..ఏపీలో కేసీఆర్ ప్లాన్: దేవినేని