telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

గాంధీనగర్‌లో రేపటి నుంచి పూర్తిగా లాక్‌డౌన్‌

Red zone corona

గుజరాత్‌ లో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజధాని గాంధీనగర్‌తోపాటు, కలోల్‌ మున్సిపాలిటీలో ఆదివారం నుంచి పూర్తిగా లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ర్టాల్లో గుజరాత్‌ రెండో స్థానంలో ఉన్నది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజివ్‌ కేసులను తగ్గించడానికి పూర్తిగా లాక్‌డౌన్‌ ప్రకటించారు.

రాష్ట్రంలోని అహ్మదాబాద్‌, సూరత్‌లో ఇప్పటికే పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ను అమలుచేస్తున్నారు. గుజరాత్‌లో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా అహ్మదాబాద్‌, సూరత్‌, గాంధీనగర్‌లోనే ఉంటున్నాయి. రాష్ట్రంలో గత ఆరు రోజులుగా సుమారు 400 కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా గాంధీనగర్‌, కలోల్‌ మున్సిపాలిటీల్లో పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో ఈ నెల 17 వరకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ను విధించింది.

Related posts