తెలంగాణలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్టవేసేందుకు ప్రభుత్వం పకడ్బంధీ చర్యలు చేపట్టింది. హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో 11 మందికి పూర్తిగా నయమైందని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 67 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇటీవల కరోనా సోకడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 11 బాధితులకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని కేటీఆర్ ట్విటర్లో పేర్కొన్నారు. వీరందరిని ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జి చేయనున్నట్టు సమాచారం.
వాళ్లు కూడా మనుషులే… బ్లడీ స్టుపిడ్ పోలీస్