విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఏపీ సీఎం జగన్ అన్నారు. ప్రమాదంపై అధ్యయనం చేసేందుకు కమిటీని కూడా వేశామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఏం చేయాలనే దానిపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుందని జగన్ చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు అలారం మోగాలని, కానీ అలా జరగలేదని తెలిపారు
మల్టీ నేషనల్ కంపెనీలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. అస్వస్థతకు గురైన వారు, అపస్మారక స్థితిలో ఉన్నవారు కోలుకుంటున్నారని చెప్పారు. ఈ ఘటనపై విచారణ చేయాలని జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ను ఆదేశించామని చెప్పారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని అన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చేలా చూస్తామని చెప్పారు.