తన అనుచరుల పై పోలీసులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఇటీవలే ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ తన గన్ మెన్లను వెనక్కి పింపించి వేశారు. అఖిలప్రియతో పాటు సోదరుడు ఎమ్మెల్యే భూమా బ్రహ్మాంనందరెడ్డి కూడా గన్ మెన్లను తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం పై హోంశాఖ మంత్రి చినరాజప్ప ఘాటుగా స్పందించారు. రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అఖిలప్రియ ఇంకా చాలా తెలుసుకోవాలని సూచించారు.
పార్టీలో కానీ ఇతర అంశాల్లో ఏమైనా సమస్యలు ఉంటే పెద్దల దృష్టికి తీసుకురావాలని అంతేకానీ ఇలా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదని ఆయన సూచించారు. ప్రస్తుతానికి భూమా అఖిలప్రియ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లిందని ఆయనే సమస్యను పరిష్కారిస్తారని చెప్పుకొచ్చారు. పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని దాన్ని ప్రతీ ఒక్కరూ పాటించాల్సిందేనని మంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు.
విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం రాజకీయం: వీహెచ్