telugu navyamedia
రాజకీయ వార్తలు

మరోసారి పాక్ వక్ర బుధ్ధి.. భారత్ పై ఇమ్రాన్ ఆరోపణలు

imran on terrorism in UN

జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ రియాజ్ ను మన భద్రతా బలగాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ పై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. పాకిస్థాన్ ను లక్ష్యంగా చేసుకుని భారత్ చేబడుతున్న తప్పుడు ఆపరేషన్ల విషయమై ప్రపంచాన్ని హెచ్చరిస్తున్నానని ఆయన అన్నారు.

నియంత్రణ రేఖ వెంబడి చొరబాట్లు జరుగుతున్నాయన్న భారత్ నిరాధార ఆరోపణలు చేస్తుందన్నారు. కశ్మీర్ లో జరుగుతున్న అల్లర్లను స్థానిక అల్లర్లుగా ఆయన అభివర్ణించారు. అధికార పార్టీ బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుబట్టిన ఇమ్రాన్, ఆ నిర్ణయాల వల్లే దక్షిణాసియాలో శాంతికి భంగం వాటిల్లుతోందని ఆరోపించారు.

Related posts