చైనా నుండి వచ్చిన కరోనా ప్రపంచం మొత్తని అతలాకుతల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకు దేశంలో కరోనా కేసులు వేల సంఖ్యలో పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎందరో రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. ఇక దేశంలో 1.32 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 1,32,05,926 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా… కరోనా వల్ల మొత్తం 794 మంది మృతి చెందారు. ఇది ఇలా ఉండగా.. తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కు కరోనా సోకింది. ఇటీవలే మోహన్ భగవత్ కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భగవత్కు తేలికపాటి లక్షణాలు కనిపించగా.. కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే.. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆర్ఆర్ఎస్ శుక్రవారం వెల్లడించింది. అంతేకాదు.. నాగ్పూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మోహన్ భగవత్ చేరారని పేర్కొంది ఆర్ఎస్ఎస్ బృందం.