telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“జగదేకవీరుడు అతిలోక సుందరి” సీక్వెల్ లో జాన్వీ ?

Jahnavi-Kapoor

చిరంజీవి, శ్రీదేవి జంటగా రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ విడుదలై ఇవాళ్టికి 30 సంవత్సరాలు పూర్తి అయ్యింది. సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో క్రియేట్ చేసిన సెన్సేషన్‌ను టాలీవుడ్‌ ప్రేక్షకులు మర్చిపోలేరు. కాగా ఈ సినిమాకు సీక్వెల్‌ కచ్చితంగా ఉంటుందని.. దాన్ని తీసిన తరువాతే రిటైర్‌ అవుతానని నిర్మాత అశ్వనీదత్ ఇటీవల ప్రకటించారు. దీంతో ఈ సినిమా సీక్వెల్‌ మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఈ సీక్వెల్‌లో ఎవరు నటిస్తారు..? ఎవరు దర్శకత్వం వహిస్తారన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ మూవీ సీక్వెల్‌లో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ఉంటాడని తెలుస్తున్నప్పటికీ.. హీరోయిన్‌గా శ్రీదేవీ తనయ జాన్వీ ఒప్పుకుంటుందా..? లేదా..? అనే ప్రశ్న అందరిలో మొదలైంది. దఢక్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. ప్రస్తుతం కేవలం హిందీ సినిమాల్లోనే నటిస్తోంది. కాగా శ్రీదేవీ బతికున్న సమయంలో జగదేక వీరుడు అతిలోక సుందరి గురించి మాట్లాడిన ఆమె.. తన పాత్రలో ఇప్పటి హీరోయిన్లలో తమన్నా సరిపోతుందని పేర్కొన్న విషయం తెలిసిందే.

Related posts