telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా బీభత్సం… 470 మంది చిన్నారులకు పాజిటివ్ !

దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయి లో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.18 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 62,714 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా…కరోనా వల్ల మొత్తం 312 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 28,739 డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,19,71,624 కాగా .. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 4,86,310 గా ఉన్నాయి. ఇక కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా వైరస్‌ రోజు రోజుకు విజృంభిస్తోంది. ఈ నెల మొదటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా 470 మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారు. వీరంతా పదేళ్లలోపే వారే కావడం గమనార్హం. ఈ నెల 1 నుంచి 26 మధ్య 244 మంది అబ్బాయిలు, 228 మంది బాలికలు కరోనా మహమ్మారి బారిన పడినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గతంలో రోజుకు 8 నుంచి 9 మంది చిన్నారులు వైరస్‌ బారినపడేవారు. ఇప్పుడు వారి సంఖ్య 46 కు చేరుకుంది. ఇంకా కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

Related posts