పల్నాడులో జరుగుతున్న అన్ని దుర్మార్గాలకూ ప్రభుత్వానిదే బాధ్యతని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ట్విటర్ లో ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పెట్టిన కేసున్నింటినీ తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ధ్వంసం చేసిన ఆస్తులకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనన్నారు.
బాధితులకు న్యాయం చేయాలన్నదే టీడీపీ ధృడ సంకల్పం అని అన్నారు. అధికారులు ఓ వైపు గుంటూరు శిబిరంలో చర్చలు చేస్తూ మరోవైపు గురజాల డివిజన్ లో 144 సెక్షన్ విధించారని అన్నారు.బాధితులకు న్యాయం జరిగేంతవరకూ తాను వదిలిపెట్టబోనని హెచ్చరించారు. 110 రోజులుగా గ్రామాల నుంచి వెల్లగొట్టి, వందలాది కుటుంబాలకు జీవనోపాధి లేకుండా చేశారని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగేంతవరకూ తాను వదిలిపెట్టబోనని హెచ్చరించారు.
అందుకే చంద్రబాబు హైదరాబాద్ కు పారిపోయారు: విజయసాయిరెడ్డి