తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెను సీఎం కేసీఆర్ చిన్న చూపు చూస్తున్నారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను తక్కువ అంచనా వేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రేపు తలపెట్టిన రాష్ట్ర బంద్ కు ప్రజలందరూ మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన సకల జనుల సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను గుర్తుచేసుకోవాలని కేసీఆర్ నుద్దేశించి పేర్కొన్నారు. ప్రభుత్వ మొండి వైఖరి కారణంగా రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం నెలకొనే ప్రమాదం ఉందని కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. తెరాస నేతలు కూడా మాతో టచ్ లో ఉన్నారన్నారు. వ్యాపారస్తులు ఇతర సంస్థలు బంద్ లో పాల్గొనాలని కోరారు.