telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఇజ్రాయెల్ : ..ఉప్పు నీటిని శుద్ధి ప్లాంట్ ను … సందర్శించిన ఏపీసీఎం ..

apcm visited salt water processing plant

విదేశీపర్యటనలో ఉన్న ఏపీసీఎం జగన్ అక్కడి సరికొత్త టెక్ గురించి ఆరా తీస్తున్నారు. తాజాగా, ఇజ్రాయెల్ లోని హడేరాలో ఉన్న ఉప్పు నీటిని శుద్ధి చేసి హెచ్2ఐడీ ప్లాంట్ ను జగన్ సందర్శించారు. హడేరా ప్లాంట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ రఫీ షమీర్ సమక్షంలో ఈ ప్లాంట్ ను జగన్ సందర్శించారు. జగన్ తో పాటు టెల్ అవీవ్ లోని డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఇండియన్ మిషన్ షెరింగ్ ఉన్నారు. ఉప్పునీటిని తాగునీటిగా మార్చే ప్రక్రియకు సంబంధించిన మెకానిజం పై ఓ ప్రదర్శన ఇచ్చారు.

ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఇతర వివరాలను జగన్ కు వివరించారు. శుద్ధి చేసిన ఉప్పునీటిని జగన్ సహా అధికారులు రుచి చూసి, దాని నాణ్యతను తెలుసుకుని ప్రశంసించారు. ఇజ్రాయెల్ పర్యటన ముగించుకుని జగన్ కుటుంబసభ్యులు నేటి రాత్రికి స్వదేశం తిరిగి బయలుదేరనున్నారు.

Related posts