telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సీఎం జగన్ అభ్యర్థనపై సీబీఐ అభ్యంతరం

jagan

ఆర్థిక నేరాల కేసులో కోర్టుకు వ్యక్తిగత హాజరు మినహాయింపుపై ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఆయన అభ్యర్థనను తిరస్కరించాలని సీబీఐ కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సీబీఐ కోర్టులో మంగళవారం సీబీఐ అధికారులు కౌంటర్‌ దాఖలు చేశారు.

జగన్‌ పిటిషన్‌ కొట్టివేయాలని వారు కోరారు. సాక్షులుగా ఉన్న అధికారులు సీఎం జగన్‌ అధీనంలోనే ఉన్నారని, జగన్‌కు మినహాయింపు ఇస్తే ప్రభుత్వాధినేతగా సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశముంటుందని అభ్యంతరం వ్యక్తంచేశారు. సీబీఐ వాదనల అనంతరం న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.

Related posts