telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

150 పూర్తి చేసుకున్న రోహిత్‌ శర్మ…

rohit sharma records in 3rd test on south africa

చెన్నై వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య నేడు రెండో టెస్ట్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు మొదట్లోనే షాక్ తగ్గిలింది. మ్యాచ్ రెండో ఓవర్లోనే వెనుదిరిగిన ఓపెనర్ గిల్ డక్ ఔట్ గా వెనుదిరిగాడు. దాంతో ఒక పరుగు చేయకుండానే వికెట్ కోల్పోయిన టీం ఇండియా. అయితే గిల్ ఔట్ కావడంతో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన పుజారాతో కలిసి మరో ఓపెనర్ రోహిత్ శర్మ మంచి భాగసామ్యం నెలకొల్పాడు. కానీ 21 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పుజారా ఔట్ అయ్యాడు. దాంతో బ్యాటింగ్ కు వచ్చిన కోహ్లీ కూడా డక్ ఔట్ గా వెనుదిరగడంతో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. పుజారా (21) కూడా తక్కువ పరుగులకే అవుట్‌ కావడంతో ఇండియా 106 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఇలాంటి తరుణంలో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ 150 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. అతడికి తోడుగా అజింక్య రహానే 59 పరుగులతో అదరగొట్టాడు. దీంతో టీం ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. ప్రస్తుతం రోహిత్‌ శర్మ, రహానే క్రీజులో ఉన్నారు.  

Related posts