టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సీఐడీ షాక్ ఇస్తోంది. అసైన్డ్ భూముల కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తోన్న సీఐడీ… కీలక సాక్ష్యాధారాలు సేకరించే పనిలో బిజీగా అయిపోయాయి సీఐడీ బృందాలు. గత ప్రభుత్వం జారీ చేసిన జీవోల వెనుక జరిగిన తెర వెనుక మంత్రాంగానికి సంబంధించిన ఆధారాలు సేకరించే పనిలో సీఐడీ టీమ్స్ ఉండగా… చంద్రబాబు హయాంలో అసైన్డ్, లంక భూములకు సంబంధించిన జీవోల వెనుకున్న నోట్ ఫైల్స్ను సేకరిస్తోంది సీఐడీ. రైతుల నుంచి సేకరించిన ఆధారాలతోపాటు.. నోట్ ఫైల్స్ రూపంలో ఉన్న సాక్ష్యాలను కూడా కోర్టుకు సమర్పించేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది సీఐడీ. కొన్ని జీవోల జారీకి నాటి అధికారులు అభ్యంతరాలు తెలిపిన వివరాలన్నీ నోట్ ఫైల్సులో ఉన్నాయంటోన్న సీఐడీ… అసైన్డ్ భూముల అక్రమాలకు నాటి ప్రభుత్వ పెద్దల పాత్ర నోట్ ఫైల్సులో స్పష్టంగా ఉందంటోంది సీఐడీ.
previous post