telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేరగాళ్లకు వైసీపీ కేరాఫ్ అడ్రస్: కళా వెంకట్రావు

kalavenkat rao tdp

వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు విరుచుకుపడ్డారు. నేరగాళ్లకు వైసీపీ కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. ప్రజాప్రతినిధులపై కోర్టుల్లో ఉన్న కేసుల వివరాలు అందజేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో జగన్ సహా వైసీపీ నేతలందరికీ భయం పట్టుకుందని అన్నారు.

వైసీపీలో 50 మంది ఎమ్మెల్యేలపై సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆరోపించారు. నేరగాళ్లకు అడ్డాగా మారిపోయిన ఆ పార్టీలో 9 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు, ఏడుగురు ఎంపీలపై అత్యాచారం కేసులు ఉన్నాయని వివరించారు.

సీఎం జగన్ పై ఉన్న కేసులు 8 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయని, సీఎం కుంటిసాకులతో విచారణకు హాజరవడంలేదని ఆరోపించారు. తమపై ఉన్న కేసులు విచారణ చేయాలని సుప్రీం కోర్టుకు జగన్, విజయసాయిరెడ్డి లేఖ రాయగలరా? అని ప్రశ్నించారు. 

Related posts