telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఏపీలో మరో కరోనా కేసు.. ప్రకాశం జిల్లా యువకుడికి పాజిటివ్!

karona

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడం తీవ్ర కలకలం రేపింది. దీంతో ప్రభుత్వం మరింత అప్రమత్తం అయింది.లండన్ నుంచి ఒంగోలు నగరానికి వచ్చిన ఓ యువకుడికి కరోనా పాజిటవ్ వచ్చింది. ఈ నెల 13న ఢిల్లీ మీదుగా ఒంగోలుకు వచ్చిన అతను, ఇంటికి చేరుకుని, రెండు రోజుల తరువాత హైదరాబాద్ వెళ్లాడు. అక్కడి నుంచి ఏసీ బస్సులో ఒంగోలుకు వచ్చాడు. గుంటూరుకు కూడా వెళ్లి వచ్చాడు. ఆపై అతనికి జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలో చేర్చగా, వైద్యులు పరీక్షలు చేసి, కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు.

వెంటనే అప్రమత్తమైన వైద్యులు రిమ్స్ లోని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్సను అందిస్తూ, కుటుంబ సభ్యులను పరిశీలనలో ఉంచారు. రోగి నివాసం ఉన్న ఒంగోలు, ముంగమూరు డొంక ప్రాంతంలోని మూడు కిలోమీటర్ల పరిధిలోని అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

Related posts