telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని చెప్పి.. పోలీసు రాజ్యాన్ని తీసుకొచ్చారు: దేవినేని

uma devineni

వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు నిప్పులు చెరిగారు. పోలీసులను అడ్డు పెట్టుకుని టీడీపీ నేతలను అరెస్ట్ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశంలో అతి తక్కువ కాలంలో అత్యంత ఎక్కువ అప్రతిష్టను మూటకట్టుకున్న పార్టీ వైసీపీనే అని ఎద్దేవా చేశారు.

రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని చెప్పిన జగన్… ఇప్పుడు పోలీసు రాజ్యాన్ని తీసుకొచ్చారని విమర్శించారు. వచ్చే ఎన్నికల వరకు వైసీపీ ప్రభుత్వం ఉండబోదని చెప్పారు. జమిలి ఎన్నికలు వచ్చేంత వరకు కూడా ప్రభుత్వం నిలవదని అన్నారు. రెండేళ్లలో ప్రభుత్వాన్ని తనంతట తానే జగన్ రద్దు చేస్తారని జోస్యం చెప్పారు. 

Related posts