telugu navyamedia
రాజకీయ

‘నేనెవరో.. ఏం చేస్తుంటానో తెలుసా అన్న ప్రధాని మోదీ? -అదిరిపోయే రిప్లై ఇచ్చిన చిన్నారి

భార‌త ప్రధాని నరేంద్ర మోదీకి, ఓ చిన్నారికి మధ్య ఆసక్తికర సంభాష‌ణ‌ జరిగింది. ఆ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బీజేపీ ఉజ్జయిని ఎంపీ అనిల్ ఫిరోజియా కుటుంబ సభ్యులు పార్ల‌మెంట్‌లో కలిశారు. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ, ఎంపీ ఎనిమిదేళ్ల కుమార్తెకు మధ్య జరిగిన వినోధభరితమైన సంభాషణ అందరినీ ఆకట్టుకుంటోంది.

బీజేపీ ఎంపీ కుమార్తె ఆహానా ఫిరోజియాను నేనెవరో తెలుసా? అని సరదాగా అడిగారు. దానికి స్పందించిన చిన్నారి..‘‘మీరు ప్రధాని మోదీ… ప్రతి రోజూ టీవీలో వస్తుంటారు.’’ అని రిప్లై ఇచ్చింది. చిన్నారి సమాధానానికి ప్రధాని మోడీ గట్టిగా నవ్వేసాడు. అనంతరం ఆ చిన్నారికి ప్రధాని మోదీ.. ఓ చాక్లెట్‌ను బహుమతిగా అందజేశారు. అనిల్ ఫిరోజియా మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. 

కాగా, ప్రధాని మోదీతో తమ కుటుంబ సభ్యుల భేటీకి సంబంధించిన ఫోటోలను ఎంపీ ఫిరోజియా ట్వీట్ చేశారు. ‘‘ఇవాళ నా కుమార్తెలు ఆహానా, ప్రియాంషీ ఇద్దరూ ప్రధాని మోదీని కలిశారు. ఆయన ఆప్యాయతను పొందారు.. ఇది చాలా సంతోషంగా ఉంది.’’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇదిలాఉంటే.. అనిల్ ఫిరోజియాకు కిలోబరువు తగ్గితే వెయ్యి కోట్ల చొప్పున నియోజక వర్గానికి నిధులు ఇస్తానని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ బంపర్ ఆఫర్ ఇచ్చారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్లోని మాల్వా ప్రాంతంలో రూ. 5,772 కోట్ల విలువైన 11 రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు కింద 534 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కారీ మాట్లాడుతూ.. నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు కోరుతున్న ఉజ్జయిని బీజేపీ ఎంపీ అనిల్ ఫిరోజియాకు ఒక సవాల్ విసిరారు. 

దీంతో  ఫిరోజియా ఇప్పుడు 21 కిలో బరువు తగ్గారు. ఇదే విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ.. తాను ఇప్పుడు 21 కిలోల బరువు తగ్గానని, రూ. 21వేల కోట్ల నిధులు అర్హత పొందానని పేర్కొన్నారు. కాగా, ఫిరోజియా బరువు తగ్గడంపై ప్రధాన మోదీ కూడా స్పందించారు. ఇంకాస్త బరువు తగ్గి పూర్తి ఫిట్‌గా ఉండాలని సూచించారు.

Related posts