ఎస్సీలను విడగొట్టాలని చంద్రబాబు ప్రయత్నాలు చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు ఈ రోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ…. గత ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ నియోజక వర్గాల్లో ఒకచోట టీడీపీ, ఒకచోట జనసేన మాత్రమే గెలిచాయని చెప్పారు. మిగతా అన్ని స్థానాల్లోనూ తమ పార్టీయే విజయం సాధించిందని అన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీలకు కలిపి ఆరు మంత్రి పదవులు ఇచ్చామని చెప్పారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలలో ఇద్దరు ఎస్సీ, ఎస్టీ డిప్యూటీ సీఎంలు ఉన్నారని తెలిపారు. తమ ప్రభుత్వం చేపడుతోన్న పలు కార్యక్రమాలకు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కూడా మద్దతు తెలిపారని అన్నారు.