telugu navyamedia
క్రీడలు వార్తలు

ఈ ఏడాది ముంబై ని ఓడించడం చాలా కష్టం….

ఐపీఎల్‌ 2021 లో ముంబై ఇండియన్స్‌ను ఓడించడం కష్టం. ఇంగ్లండ్‌తో జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆ జట్టు ఆటగాళ్లు చెలరేగారు. వారంతా మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇషాన్‌, సూర్య ఆడిన తీరు అద్భుతం. తొలి అంతర్జాతీయ సిరీస్‌లోనే అదరగొట్టారు. అలాగే హార్దిక్ పాండ్యా తిరిగి బౌలింగ్‌ చేయడం శుభపరిణామం. అది ముంబై జట్టుకే కాకుండా టీమిండియాకు ఎంతో కీలకం. దీన్ని బట్టి అతను జూన్‌లో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కాసిన్ని ఓవర్లు అయినా బౌలింగ్‌ చేయగలడు. దానికింకా చాలా సమయం ఉన్నా అది టీమిండియా, ముంబై జట్లకు మంచి విశేషం’ అని గవాస్కర్‌ పేర్కొన్నాడు. అయితే ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 మ్యాచ్‌లు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది టోర్నీ మొదటి మ్యాచ్‌ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఏప్రిల్ 9న ముంబై ఇండియన్స్ ఢీ కొట్టబోతోంది.

Related posts