telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీలో కొత్త రైల్వే ప్రాజెక్ట్‌లు సాధ్యం కావు..ఎందుకంటే

ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే ప్రాజెక్టులు ఇచ్చే ప్రశ్నే లేదని కేంద్రం తేల్చి చెప్పింది..ఏపీ ప్రభుత్వం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన పార్లమెంట్‌కు తెలియజేశారు. 

లోక్‌సభలో వైసీపీ ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

ఏపీకి రైల్వే ప్రాజెక్టులు కోరుతున్న ఎంపీ… రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఒప్పించి కేంద్రానికి స‌హ‌క‌రించేలా చేస్తే… ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ప్రాజెక్టులు అయినా త్వ‌రిత‌గ‌తిన పూర్తి అవుతాయ‌ని మంత్రి వివ‌రించారు

ప్రస్తుతం ఏపీలో 70వేల కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయని కానీ అవన్నీ ఆగిపోయాయన్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున త‌న వాటాగా రూ.1,798 కోట్లు ఇవ్వాల్సి ఉంద‌ని తెలిపారు. ఈ నిధుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేయ‌డం లేద‌ని ఆయ‌న ఆరోపించారు.

ఇలాంటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఏపీకి కొత్త‌గా రైల్వే ప్రాజెక్టుల‌ను ప్ర‌క‌టించ‌డం సాధ్యం కాద‌ని మంత్రి తేల్చి చెప్పారు. వైఎస్ఆర్‌సీపీ ఎంపీనే ప్రశ్న అడిగి మరీ ఈ విషయాన్ని బయట పెట్టించడం చర్చనీయాంశంగా మారింది.

Related posts