telugu navyamedia
రాజకీయ వార్తలు

బోటు ప్రమాదం పై మోదీ దిగ్భ్రాంతి

narendra-modi

ఏపీలో జరిగిన పర్యాటక బోటుప్రమాదం పై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఓ బోటు నదిలో మునిగిపోయిందని తెలిసి ఎంతో బాధపడుతున్నానని తెలిపారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విషాద ఘటన జరిగిన ప్రదేశంలో ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయని మోదీ ట్వీట్ చేశారు.

మరోవైపు సహాయ చర్యల కోసం రాజమండ్రి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌ను ఘటనా స్థలానికి పంపారు. ఇప్పటి వరకు 12 మంది మృతదేహాలను వెలికితీశారు. మరో 24 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఇంకా 25 మంది ఆచూకి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి.

Related posts