ఏపీ రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్న లక్ష్మీ పార్వతి త్వరలో తెరపై కనిపించనున్నారు. ‘రాధాకృష్ణ’ అనే ఒక సినిమాలో ఆమె ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. సాగరిక- శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా దర్శకుడిగా ప్రసాద్ వర్మ పరిచయమవుతున్నాడు. నిర్మల్ కొయ్యబొమ్మల నేపథ్యంలో ఆయన ఒక సినిమాను రూపొందిస్తున్నాడు.అనురాగ్ – ముస్కాన్ శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో కీలకమైన పాత్రలో లక్ష్మీ పార్వతి కనిపించనున్నారు.
వినోదంతో కూడిన ఈ సినిమా కొంత కాలంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. సంపూర్ణేష్ బాబు .. కృష్ణభగవాన్ ..చమ్మక్ చంద్ర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.