telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

భారత్‌కు ఫ్రాన్స్‌ సాయం..వైద్య సామగ్రి అందజేత

Medidcal kits france India

భారత్‌లో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు ఫ్రాన్స్‌ చేయూతనిచ్చింది. వెంటిలేటర్లు, టెస్ట్‌ కిట్లు, ఇతర వైద్య సామగ్రిని భారత్‌కు పంపించింది. భారత్‌లోని ఫ్రాన్స్‌ రాయబారి ఇమ్యాన్యుయేల్‌ లెనైన్‌ వీటిని ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీకి అందజేశారు. ఫ్రాన్స్‌ నుంచి భారత్‌కు మొత్తం 50 ఒసిరిస్‌ 3 వెంటిలేటర్లు, 70 యువెల్‌ 800 వెంటిలేటర్లు, 50 వేల టెస్ట్‌కిట్లు ,50 వేల స్వాబ్స్‌లు అందాయి.

కరోనాను ఫ్రాన్స్ సమర్థంగా కట్టడి చేసింది. ఫ్రాన్స్‌లో మొత్తం 1,83,804 కేసులు నమోదు కాగా 30,200 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లో మాత్రం కరోనా విజృంభించడంతో ప్రతిరోజు 45 వేలకు పైగా కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 14,83,157కి చేరింది. ఇప్పటివరకు 33,425 మంది మృత్యువాత పడ్డారు.

Related posts