telugu navyamedia
క్రీడలు వార్తలు

ఇంగ్లాండ్ పై ఓటమికి కారణాలు చెప్పిన కోహ్లీ…

ఇంగ్లాండ్ తో జరిగిన జరిగిన మొదటి మ్యాచ్ లో ఓడిపోవడం పై కోహ్లీ స్పందించాడు. ఈ మ్యాచ్ లో పిచ్‌ను అంచనా వేయడంలో విఫలమయ్యామని, అందుకే ఓడిపోయామని విరాట్ కోహ్లీ అన్నాడు. అలాగే అనవసర షాట్స్‌కు పోయి వికెట్లు పారేసుకున్నామన్నాడు. ‘ఈ పిచ్‌పై ఎలా ఆడాలో మాకు అవగాహన లేకపోయింది. మేము ఆశించిన విధంగా షాట్స్‌ను ఆడలేకపోయాం. బంతి బౌన్స్ అవుతున్నప్పుడు ఎలా ఆడాలో… శ్రేయస్ అయ్యర్ మాకు చూపించాడు. కానీ.. అప్పటికే చాలా వికెట్లు చేజార్చుకున్నాం. చివరి 10 ఓవర్లప్పుడు చేతిలో 8 వికెట్లు ఉంటే ఇంగ్లండ్ ముందు పోరాటే స్కోర్‌ను ఉంచేవాళ్లం. కానీ ఈ పిచ్‌పై షాట్ సెలక్షన్‌లో విఫలమయ్యాం. అయితే టీ20 ప్రపంచకప్ ముందు మాకున్న టీ20 సిరీస్ ఇదొక్కటే. అందుకే కొన్ని ప్రయోగాలు చేయాలనుకుంటున్నాం. అలాగని తేలికగా తీసుకోవడం లేదు. రెండో టీ20లో ఆ తప్పిదాల్ని సరిచేసుకొని.. బలంగా బరిలోకి దిగుతాం’ అని కోహ్లీ తెలిపాడు.

Related posts