మహారాష్ట్ర సీఎం గా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో రాజకీయ అనిచ్ఛితికి తెరపడడంతో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. దేవేంద్ర ఫడ్నవిస్ కు బలనిరూపణకు వారం రోజుల గడువు ఇస్తున్నట్టు గవర్నర్ కోష్యారీ తెలిపారు. నవంబరు 30లోపు బలనిరూపణ చేసుకోవాలని ఆదేశించారు.
మహారాష్ట్ర పరిణామాలతో కంగుతిన్న కాంగ్రెస్ ఈ రోజు కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ హాజరై మహారాష్ట్రలో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చిస్తారు. మరోవైపు తమ పార్టీ ఎమ్మెల్యేలతో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ సమావేశం ఏర్పాటు చేశారు.