అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. శెట్టూరు మండలం ములకలేడు గ్రామంలో శనివారం తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా..మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
క్షతగాత్రులను కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. సిలిండర్ పేలుడు ధాటికి ఇల్లు కూడా ధ్వంసమైంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందండంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు జైనాభి(60), కుమారుడు దాదు(36), కోడలు సర్ఫున్ని (28) మూడేళ్ళ మనవరాలు బేబీ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.