జమ్మూకశ్మీర్లోని షోపియాన్ ట్రంజ్ ప్రాంతంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. నిన్న సాయంత్రం పంజాబ్కు చెందిన యాపిల్ వర్తకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన తర్వాత పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారు. లోయలో విధ్వంసానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, భారత సరిహద్దు భద్రతా దళాలు వారి ఆటలు సాగనీయకుండా సమర్థంగా అడ్డుకుంటున్నాయి. నిన్న ఉదయం అనంత్నాగ్ జిల్లాలోని బిజ్మెహరా ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
ఓటమి విషయమై ఎవరినీ తప్పుబట్టడం లేదు: దేవెగౌడ