telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

దుండగుల కాల్పుల్లో తృణ‌మూల్ కాంగ్రెస్ నేత‌ హతం

maxresdefault

కోల్‌కతాలో తృణ‌మూల్ కాంగ్రెస్ నేత‌న నిర్మ‌ల్ కుందూను కాల్చి చంపారు. మంగ‌ళ‌వారం రాత్రి బైక్‌పై వ‌చ్చిన ఇద్ద‌రు కాల్చి చంపారు. ఓ టీ స్టాల్ ద‌గ్గ‌ర స్థానికుల‌తో మాట్లాడుతున్న‌ సమయంలో బైక్‌పై ఉన్న వ్య‌క్తి టీఎంసీ నేత‌ను షూట్ చేశాడు. కాల్చిన వెంట‌నే బైక్‌పై వ‌చ్చిన ఇద్ద‌రు జ‌నం మ‌ధ్య నుంచి ప‌రార‌య్యారు. హాస్ప‌ట‌ల్‌కు తీసుకువెళ్తున్న స‌మ‌యంలో టీఎంసీ నేత ప్రాణాలు విడిచాడు.

బీజేపీ నేత‌లే కుందూను చంపిచారంటూ టీఎంసీ ఆరోపిస్తున్న‌ది. బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ గురువారం కుందూ ఇంటికి వెళ్ల‌నున్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించిన త‌ర్వాత నుంచి బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మ‌ధ్య హింసాత్మ‌క దాడులు జ‌రుగుతూనే ఉన్నాయి.

Related posts