నిఘావర్గాలు సమాచారం ఇచ్చినా, అరుణాచల్ప్రదేశ్లో జరిగిన ఉగ్రదాడి జరగకుండా ఆపలేకపోయారు. ఈ దాడిలో ఒక ఎమ్మెల్యే, ఇద్దరు భద్రతా సిబ్బంది సహా 10 మంది హతమయ్యారు. తిరాప్ జిల్లాలోని బొగాపాని గ్రామంలో మాటు వేసిన ఎన్ఎస్సీఎన్ అనుమానిత ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. నేడు అసోం నుంచి తన నియోజకవర్గమైన ఖోన్సాకు ఎమ్మెల్యే తిరోంగ్ అబో తన భద్రతా సిబ్బంది, మరో ఎనిమిది మందితో కలిసి వెళుతుండగా బొగాపాని వద్దకు రాగానే కాల్పులు జరిపారని ఆ ప్రాంత డిప్యూటీ పోలీస్ కమిషనర్ పీఎన్ తుంగోన్ తెలిపారు.
ఈ ఘటనలో ఎమ్మెల్యే తిరోంగ్ అబో కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్పీపీ అధ్యక్షుడు, మేఘాలయా ముఖ్యమంత్రి కన్రాద్ సంగ్మా ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘ఈ వార్త తెలుసుకొని ఎన్పీపీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ దాడి జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పీఎంవోను కోరుతున్నాం’ అని ట్వీట్ చేశారు.
ఈ దాడుల నేపథ్యంలో, కౌంటింగ్ రోజున భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఒకవైపు ఉగ్రమూక, మరోవైపు తుచ్ఛమైన రాజకీయపార్టీలు.. గెలుపు ఓటముల మధ్య ఎప్పుడు ఏ గొడవలు రాజుకుంటాయో అని .. కౌంటింగ్ రోజును తలుచుకొని రక్షణ రంగం కూడా ఆందోళనతోనే ఉంది. అదే స్థాయిలో అన్ని కేంద్రాల వద్ద భారీగా బలగాలలు మోహరిస్తున్నారు. ఎల్లుండి కౌంటింగ్ సజావుగా సాగుతేనే, అటు ఎన్నికల సంఘానికి, ఇటు రక్షణ శాఖకు ప్రశాంతత.