telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రీడలు క్రైమ్ వార్తలు ట్రెండింగ్

ఐపీఎల్ బెట్టింగులు బాబోయ్ బెట్టింగులు : 15 మంది అరెస్ట్..

SIT Investigation YS viveka Murder

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఐపీఎల్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ వెంకట రమణ మీడియాకు తెలిపారు. చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌పై బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్టు తెలిసిందన్నారు.

ఈ బెట్టింగ్ సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతోందన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించామని తెలిపారు. వీరు గూగుల్ పే యాప్ ద్వారా డబ్బు లావాదేవీలు నిర్వహిస్తున్నట్టు విచారణలో వెల్లడైందని డీఎస్పీ తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారి నుంచి రూ.7500 నగదు, 18 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

Related posts