బాలీవుడ్, శాండల్వుడ్లో డ్రగ్ కేసు సంచలనం సృష్టించింది. బాలీవుడ్లో పలువురు సినీ నటీనటులు, స్టార్ హీరోయిన్స్ పేర్లు ఈ కేసులో వినిపించాయి. ఇక శాండల్వుడ్కు వస్తే సంజన గల్రానీ, రాగిణీ ద్వివేది పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరికి డ్రగ్ ప్లెడర్లతో సంబంధాలు ఉన్నాయని, తరచూ డ్రగ్ తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో సీసీబీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.
ఈ నేపథ్యంలో డ్రగ్స్ సేవిస్తున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాగిణి ద్వివేది, సంజనల నుంచి సేకరించిన వెంట్రుకల నమూనాల్లో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ జరిపిన పరీక్షల్లో నిర్ధారణ కావడంతో ఆ ఇద్దరూ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా ఆ ఇద్దరు హీరోయిన్స్ని విచారణకు హాజరు కావాల్సిందిగా మరోసారి నోటీసులు జారీ చేసేందుకు బెంగళూరు పోలీసులు సిద్ధమయ్యారు.
రాగిణి ద్వివేది, సంజన నుంచి తొలుత సేకరించిన బ్లడ్ శాంపిల్స్, యూరిన్ శాంపిళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపగా అందులో ఫలితం ఎటూ కనిపించలేదు. దీంతో గతేడాది అక్టోబర్ నెలలో మరోసారి ఆ ఇద్దరు హీరోయిన్స్ వెంట్రుకలను నమూనాలుగా సేకరించి ఎఫ్ఎస్ఎల్కు పంపించారు.
ఈసారి ఎఫ్ఎస్ఎల్ ఇచ్చిన నివేదికలో ఈ ఇద్దరు హీరోయిన్స్ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. గతంలో అనేక సందర్భాల్లో ఈ ఇద్దరు హీరోయిన్స్ పేర్లు ప్రముఖంగా ప్రస్తావనకు రాగా ఈ డ్రగ్స్ కేసు వారిని అటు కన్నడ, ఇటు తెలుగు సినీ పరిశ్రమలో మరింత పరువు తీసినట్లయ్యింది.
కాగా సంజనా ప్రభాస్ బుజ్జీగాడు మూవీతో పాటు పలు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. రాగిణి కన్నడలో స్టార్నటిగా గుర్తింపు పొందింది. కాగా ఈకేసులో జైలుకు వెళ్లిన సంజనా, రాగిణిలు ఇటీవల బెయిలుపై బయటకు వచ్చారు. జైలు నుంచి బయటకు రాగానే సంజన తన స్నేహితుడైన డాక్టర్ను పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.