ప్రకాశం జిల్లా కొనకమిట్ల మండలం గార్లదిన్నె దగ్గర మినీ ట్రక్ నుంచి జారిపడి నలుగురు మృతిచెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. ఘటనాస్థలంలోనే ఇద్దరు మృతిచెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరో ఇద్దరు చనిపోయారు. మృతులను కనకం కార్తీక్, అనిల్, బోగాను సుబ్బారావు, శ్రీనుగా గుర్తించారు.
మినీ ట్రక్లో వెళ్తుండగా డోరు విరిగిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం టైమ్లో వాహనంలో పదిమంది పెళ్లి బృందానికి చెందిన వారు ఉన్నారు. పొదిలి మండలం అక్క చెరువు నుంచి పెళ్లికి వధువు తీసుకుని వెళుతుండగా ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ వైపు బంధువుల మరణం, మరోవైపు ప్రస్తుతానికి పెళ్లి ఆగిపోవడంతో ఇరు వైపులా కుటుంబాల్లో విషాదం నెలకొంది. వివాహం జరిపించేందుకు వధువును సోమేపల్లి నుంచి పొదిలి అక్కచెరువు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
వివాహ వేడుకకు వధువును తీసుకుని త్రిపురాంతకం మండలం సోమేపల్లి నుంచి పొదిలి అక్కచెరువు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వధువు ఆటో ముందు భాగంలో కూర్చోవడంతో ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఉదయం 11 గంటలకు వివాహం జరగాల్సి ఉండగా ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో పెళ్లింట విషాదం నెలకొంది. వధువు సహా కుటుంబసభ్యులంతా కన్నీరుమున్నీరయ్యారు.