పట్టన ప్రాంతాలలో నీటిఎద్దడి తీవ్రమవుతుంది. ఇతర ప్రాంతాలలో నీరు భూమిలో సరిపడా ఇంకుతుంది.. కానీ నగరాలలో అలాంటి స్థితి లేకపోవటంతో.. భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. దీనితో తీవ్ర నీటి ఎద్దడి తప్పటంలేదు. అలాంటి ఒక నగరమైన, చెన్నై ప్రజలు దాహర్తితో అలమటిస్తున్నారు. ప్రధాన జలాశయాలు అన్ని ఎండిపోవడంతో అక్కడి ప్రజలకి తాగడానికి నీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని కంపెనీలు నీటి సమస్య వలన ఇంటి నుండే పనిచేయాలని ఉద్యోగులకి సూచించాయి. హోటల్స్లో కూడా తక్కువ మోతాదులో నీటిని ఇస్తున్నారు.
చెన్నై నగర ప్రజలకి రజని ఫ్యాన్స్ ఉచితంగా నీటిని సరఫరా చేయడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. రజని అభిమాన సంఘమైన ‘రజనీ మక్కల్ మంద్రం’ చెన్నై ప్రజలకి ఉచితంగా నీటిని సరఫరా చేసింది. ట్యాంకర్ల ద్వారా చెన్నైలోని పలు ప్రాంతాలలోని ప్రజలకు నీరు సరఫరా చేసింది. దీంతో వారికి కొంత ఊరట లభించింది. తమిళనాడు ముఖ్య మంత్రి పళని స్వామి కూడా నీటి సమస్యతో బాధపడుతున్న చెన్నై ప్రజలని ఆదుకునేందుకు కసరత్తులు చేస్తున్నారు.
రైళ్ల ద్వారా చెన్నైకు తాగునీటిని తీసుకొచ్చేందుకు రూ.65 కోట్లు కేటాయించినట్టు పేర్కోన్నారు. ప్రస్తుతం రజనీకాంత్ దర్బార్ షూటింగ్లో భాగంగా ముంబైలో ఉన్నారు. నడిగర్ సంఘం ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని రజనీ ప్రయత్నించినప్పటికి, చాలా ఆలస్యంగా పోస్టల్ ఓటు అందుకోవడంతో ఓటు వేయలేకపోయానని రజనీ రీసెంట్గా తన ట్వీట్ ద్వారా తెలిపారు.
“మన్మథుడు-2” వసూళ్ళపై నాగార్జున స్పందన